విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఓ చిరుత పులి మృతి చెందినట్లు సమాచారం. సుధా అనే పేరుతో పిలిచే ఈ ఆడ చిరుత వయోభారంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ చిరుత వయసు 20 సంవత్సరాలని, గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతి చెందినట్లు వివరించారు. అడవుల్లో చిరుతలు సహజంగా 10 నుంచి 12 సంవత్సరాలు జీవిస్తాయని జూలో రక్షణలో ఉండటం వల్ల ఈ చిరుత 20 సంవత్సరాల పాటు బతికిందని తెలిపారు.
![]() |
![]() |