విశాఖలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలలో ఓ చిరుత పులి మృతి చెందినట్లు సమాచారం. సుధా అనే పేరుతో పిలిచే ఈ ఆడ చిరుత వయోభారంతో మరణించిందని అధికారులు తెలిపారు. ఈ చిరుత వయసు 20 సంవత్సరాలని, గురువారం రాత్రి 7:30 గంటల సమయంలో మృతి చెందినట్లు వివరించారు. అడవుల్లో చిరుతలు సహజంగా 10 నుంచి 12 సంవత్సరాలు జీవిస్తాయని జూలో రక్షణలో ఉండటం వల్ల ఈ చిరుత 20 సంవత్సరాల పాటు బతికిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa