ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోశాలను ప్రారంభించిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 04:59 PM

మంగళగిరికి మంత్రి నారా లోకేష్ హామీల వర్షం కురిపించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ(శుక్రవారం)మంగళగిరి నియోజకవర్గం, యర్రబాలెం ఇండస్ట్రీయల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఏపీలో ఎప్పుడూ జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa