నరసరావుపేటవాసుల్ని పెద్ద సమస్య వచ్చిపడింది.. అర్ధరాత్రిళ్లు వస్తున్నారు.. గుట్టుచప్పుడు కాకుండా పని ముగించుకెళుతున్నారు. కొంతకాలంగా వరుస ఘటనలతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే కానీ అసలు మ్యాటర్ అర్ధం కాలేదు.. దీంతో టెన్షన్ మొదలైంది. కొంతకాలంగా పల్నాడు జిల్లా నరసరావుపేటో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్ల ముందు ఉంచిన బైక్లు, ఆటోలే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. వరుస చోరీలతో పట్టణంలో జనాలు ఆందోళనలో ఉన్నారు.
నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డిపేటలో శావల్యాపురం బొందిలిపాలేనికి చెందిన వీరాంజనేయులు ఐదు నెలలుగా లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఆయన బైక్ను రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఇద్దరు యువకులు వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ సీన్ మొత్తం ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు వీరాంజనేయులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు పట్టణంలోని ప్రకాష్నగర్లో ఆరవై అడుగుల రోడ్డు మూడో లైనులో మరో చోరీ జరిగింది. అక్కడ స్థానికుడైన కటకల నాగరాజు ఆటోను రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు.. ఆయన కూడా వెంటనే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ నెల 11 క్రిస్టియన్పాలేనికి చెందిన సురేంద్రబాబు నరసరావుపేట రైల్వేస్టేషన్ ఆవరణలో తన బైక్ను పార్క్ చేసి వినుకొండ వెళ్లాడు.. ఆయన తిరిగొచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు.
దారి అడుగుతూ మహిళను ఢీకొన్న లారీ
బాపట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవరు దారి అడుగుతూ మహిళను ఢీకొట్టడంతో ఆమె చనిపోయింది. పాత బస్టాండ్ కూడలిలో 216 ఏ జాతీయ రహదారి దగ్గర ఈ ఘటన జరిగింది. పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన నెల్లూరు శేషమ్మ( బాపట్లలో హనుమంతరావు నగర్ కాలనీలో కుమార్తె దగ్గరకు వెళ్లడానికి బస్సులో పాత బస్టాండ్ కూడలికి వచ్చాు. ఆమె రోడ్డు దాటుతుండగా అదే సమయంలో రైల్వేస్టేషన్ రోడ్డు నుంచి పొన్నూరు వెళ్లడానికి దారి అడుగుతూ పాత బస్టాండ్ కూడలి వైపు వచ్చిన ధాన్యం లారీ వచ్చి మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాలు ఆమె మీద ఎక్కటంతో చనిపోయారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
![]() |
![]() |