తమిళనాడులోని చెన్నైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలవరపాటుకు గురి చేసింది. ముఖ్యంగా భర్త డాక్టర్, భార్య లాయర్ కాగా.. పిల్లలిద్దరితో కలిసి వారు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల చెబుతున్నారు. సదరు కుటుంబానికి చెన్నైలో అనేక స్కానింగ్ సెంటర్లు కూడా ఉండగా.. వీరు అసలు బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారు, దాని వెనుక కారణం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ పూర్తి వివరాలు మీకోసం.
చెన్నైలోని అన్నానగర్కు చెందిన 52 ఏళ్ల బాల మురుగున్ సోనాలజీ డాక్టర్గా పని చేస్తున్నారు. నగంరలోని అనేక ఆస్పత్రుల వద్ద స్కానింగ్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇతడికి 47 ఏళ్ల భార్య సుమతి ఉండగా.. ఆమె న్యాయవాదిగా పని చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో మొదటి అబ్బాయి జశ్వంత్ కుమార్ నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుండగా.. రెండో అబ్బాయి లింగేష్ కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలతో ఈ దంపతులు చాలా హాయిగానే జీవిస్తున్నారు.
ఏమైందో తెలియదు కానీ ఈ ఈరోజు ఉదయం నలుగురు శవాలుగా మారి కనిపించారు. ముఖ్యంగా డాక్టర్ బాల మురుగున్ డ్రైవర్.. ప్రతిరోజూ లాగే ఈరోజు ఉదయం వారి ఇంటికి వచ్చాడు. కానీ అప్పటికి ఇంకా తలుపులు తెరవకపోవడంతో.. డ్రైవర్ పిలిచాడు. ఎంతసేపు బెల్ కొట్టినా, పిలిచినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈక్రమంలోనే దంపతులు ఇద్దరూ ఒక గదిలో, పిల్లలిద్దరూ మరో గదిలో చనిపోయి ఉండడాన్ని గుర్తించారు.
అయితే వీరంతా ఉరి వేకుసుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా డ్రైవర్ను విచారించగా.. బాల మురుగన్కు 5 కోట్ల వరకు అప్పు ఉందని. దాని వల్లే చాలో రోజులుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువై.. అప్పులు చెల్లించలేకే దంపతులు.. పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడిన ఉంటారని భావిస్తున్నారు. ఒకే ఇంట్లో నలుగురూ ప్రాణాలు కోల్పోవడం గురించి తెలుసుకన్న స్థానికులు అంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు.
![]() |
![]() |