ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంటగదిలో దొరికే మూడు వస్తువుల్ని నీటిలో కలిపి తాగితే మీ పొట్ట కరిగిపోతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:53 PM

ప్రస్తుతం చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. బెల్లీ ఫ్యాట్ అంటే బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. దీంతో ఈ పొట్ట గుండ్రటి ఆకారంలో కనిపిస్తుంది. ఈ సమస్య ఉంటే నలుగురిలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న భావన ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గుండె, బీపీ, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


స్థూలకాయం శరీరానికి ఎంత ప్రమాదకరమో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనల ద్వారా వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం , మీరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతుంటే అది మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. అధిక కొవ్వు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు (ఎండోమెట్రియల్, రొమ్ము,పెద్దపేగు) వంటి తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. ఇక, బరువు తగ్గడానికి కొన్ని వంటింటిలో దొరికే వస్తువులు సాయపడతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్సర్ తెలిపారు. ఆ వస్తువులు ఎలా సాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.


ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్సర్ సవాలియా ప్రకారం, తేనె ద్వారా మీ బరువును తగ్గించుకోవచ్చు. ఇది మెరుగైన ఫ్యాట్ బర్నర్. ఇందుకోసం 1 టీస్పూన్‌ తేనెను ఒక గ్లాసు నీటిలో కలపాలి. తేనెను ఎప్పుడూ ఎక్కువగా వేడి ఉన్న నీటిలో కానీ లేదా చల్లగా ఉన్న నీటిలో కానీ కలిపి తినకూడదని దీక్షా భావ్సర్ తెలిపారు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిలో తేనె కలిపి తాగితే మంచిదని డాక్టర్ తెలిపారు.


నిమ్మకాయ


​నిమ్మకాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కుగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ వినియోగం బరువు తగ్గడానికి సాయపడుతుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఇందుకోసం ఉదయం పూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయని దీక్షా భావ్సర్ తెలిపారు.


పసుపు


ప్రతి భారతీయ ఇంటిలో పసుపును ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు కలిపి రోజూ ఉదయాన్నే తాగాలని డాక్టర్ తెలిపారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి కొన్ని విషయాల్ని కూడా గుర్తించుకోవాలి.


అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండండి


బరువు తగ్గాలనుకునేవారు ముందు తినే తిండిపై దృష్టి పెట్టండి. ఏది పడితే అది తినడం వల్ల బరువు తగ్గకపోగా పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు జంక్ ఫుడ్స్, వేయించిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పారు. ఎందుకంటే ఈ ఆహారాలు తింటే శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడమే కాకుండా అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే ఈ ఆహారాల్ని తినకపోవడమే మేలు అంటున్నారు.


ఆరోగ్యకరమైన ఆహారాలు, వ్యాయామం


బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోండి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోండి. శారీరక శ్రమ కేలరీలను బర్న్ చేయడానికి, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సాయపడుతుంది. అంతేకాకుండా తగినంత నీరు తాగడం, నాణ్యమైన నిద్ర కూడా బరువు తగ్గడంలో సాయపడతాయి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. కనీసం ముప్పై నిమిషాల అయినా వాకింగ్ చేయడం మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com