ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 రోజులకు రూ.4.7 లక్షల జీతం.. మీకూ చేయాలనిపిస్తోందా

international |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 07:07 PM

ఉద్యోగం చేస్తున్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి గురయ్యే ఉంటారు. అది మానసికంగానైనా, శారీరకంగానైనా కావొచ్చు. ఇలాంటప్పుడే ఓ 10 రోజులు సెలవులు దొరికితే హాయిగా పడుకోవచ్చని.. ఎంచక్కా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటారు. మరి ఇలాంటి ఓ ఉద్యోగమే ఉందని తెలిస్తే ప్రతీ ఒక్కరూ దాని కోసం పాకులాడటం కన్ఫార్మ్. కానీ డబ్బులిచ్చి రెస్ట్ తీసుకోమనేది ఎవరనే అనుమానం వస్తోందా.. ఓ కంపెనీ ఉందండి. హాయిగా వారిచ్చిన బెడ్ మీద పడుకుని.. తింటూ, ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ చూడడం ఇలా తమకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు. ఇందుకోసం 10 రోజులకు 4.7 లక్షల జీతం కూడా ఇస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఫ్రాన్స్‌లోని మెడెస్ స్పేస్ క్లినిక్‌ల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ఓ ప్రయోగం చేపట్టింది. ముఖ్యంగా అంతరిక్ష యానంలో ఉన్న మానవులపై ఎలాంటి ప్రభావం పడుతుంది, దాన్ని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇందుకోసం మనుషులు నేరుగా అంతరిక్ష యానానికి పంపకుండా.. ఓ గదిలోనే వాటర్ బెడ్డుపై పడుకోబెడుతుంది. ఇది వాటర్ బెడ్‌కు సంబంధించిన చివరి ప్రయోగం కాగా.. దీంట్లో 10 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు.


ముఖ్యంగా ఎలాంటి ఎలర్జీలు, ఆహార విషయంలో పరిమితులు లేని పురుషులను మాత్రమే తీసుకున్న ఈఎస్ఏ... వారిపై ప్రయోగం చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రయోగం ప్రారంభం కాగా.. బాత్ టబ్ మాదిరిగా ఉన్న కంటైనర్లలో పది మంది వాలంటీర్లను పడుకోబెట్టారు. అయితే ఈ బాత్ టబ్స్‌ను వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో కవర్ చేసి.. వాటర్ బెడ్లను రూపొందించారు. దీనిపై పడుకుంటే నీళ్లలో తేలియాడుతున్న భావనే కల్గుతుంది. కానీ ఎలాంటి తడి అంటుకోదు. వారి తల, చేతులు మాత్రమే పైక్ ఉండగా.. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములు గాల్లో తేలియాడుతున్నట్లుగానే.. వీళ్లు కూడా ఫీల్ అవుతుంటారు.


అయితే వ్యోమగాముల మాదిరిగా వీళ్లు తినకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇష్టం వచ్చిన ఆహారం, కావాల్సినంత తినొచ్చు. సిబ్బందే నేరుగా ఆహారాన్ని బెడ్డు మీదకు తీసుకువచ్చి ఇస్తుంటారు. అయితే బాత్రూం వెళ్లాలంటే మాత్రం కంటైనర్లలో ఉన్న మాదిరిగానే వారి పొజిషన్ మార్చుకుండా ట్రాలీల్లో తరలిస్తారు. అయితే అలా గంటల తరబడి పడుకోవడం, కూర్చోవడం బోర్ కొడితే మాత్రం ఫోన్, ల్యాప్‌టాప్ వంటివి వాడుకోవచ్చు. ఎవరితోనైనా, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఇలా 10 రోజులు వాటర్ బెడ్డుపై ఉంచిన తర్వాత.. వారి నుంచి వవరాలు సేకరిస్తారు.


మరో 5 రోజులు వారి వద్దే ఉంచుకుని.. వారి పరిస్థితి ఎలా ఉంది, ఇంకా గాల్లో తేలుతున్న భావనే కల్గుతుందా, నడవడానికి సులువుగానే ఉందా వంటివన్నీ గమనిస్తారు. అయితే ఈ ప్రయోగంలో భాగమైన 10 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికీ.. 5 వేల యూరోలు (భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా 4.72 లక్షల రూపాయలు)చెల్లిస్తోంది యురోపియన్ స్పేస్ ఏజెన్సీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa