ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి నిత్యం వందల మంది భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రకృతి పారవశ్యంతో పరవశించి పోతుంటారు. ఇక స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం శ్రీశైలంలో వసతి ఏర్పా్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శి్స్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఘరానా మోసం జరిగింది.
శ్రీశైలం దేవస్థానం పేరుతో కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్ తయారు చేశారు. నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేసిన దుండగులు.. శ్రీశైలంలో వసతి కోసం ప్రయత్నించే భక్తులను మోసగించారు. కొంతమంది భక్తులు శ్రీశైలంలో వసతి కోసం ఈ నకిలీ వెబ్సైట్ను ఆశ్రయించి డబ్బులు చెల్లించి మోసపోయారు. హైదరాబాద్, ముంబయికి చెందిన భక్తులు శ్రీశైలంలో వసతి కోసం నకిలీ వెబ్సైట్ ఆశ్రయించి మోసపోయారు. డబ్బులు చెల్లించిన తర్వాత, శ్రీశైలానికి వచ్చిన అనంతరం జరిగిన మోసాన్ని గుర్తించారు. జరిగిన మోసాన్ని శ్రీశైలం దేవస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో నకిలీ వెబ్సైట్ వ్యవహారం బయటకు వచ్చింది.
శ్రీశైలం వచ్చే భక్తులను సైబర్ నేరగాళ్లు గతంలోనూ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడ్డారు. వసతి కోసం ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి మోసాలకు పాల్పడ్డారు. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా మోసం చేసిన ఘటన గతేడాదిలోనూ వెలుగు చూసింది. వసతి గదులను ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తుండటం.. సైబర్ మోసగాళ్లకు ఆసరాగా మారింది. తాజాగా మరోసారి ఈ తరహా మోసం వెలుగుచూడటంతో.. దేవస్థానం అధికారులు ఈ మోసాలపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవటం ద్వారా మరోసారి ఇలాంటి మోసాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. మరోవైపు శ్రీశైలం దర్శనానికి సంబంధించిన పాత టికెట్లను ఎడిట్ చేసి.. తేదీలు మార్చి.. ఎక్కువ ధరకు విక్రయిస్తున్న మోసం కూడా ఇటీవల బయటపడిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa