విద్యారంగానికి అత్యధిక ప్రాధ్యానతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐఐటీ మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, టాటా, ఎల్ అండ్ టీ సంస్థల సహకారంతో అమరావతి ప్రాంతంలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీ నెలకొల్పే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును నారా లోకేష్ మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో గతంలో సెంచూరియన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో విదేశీ యూనివర్సిటీలు క్యాంపస్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. అలాగే దేశంలోని టాప్ యూనివర్సిటీలను ఏపీకి రప్పించే పనిలో ఉన్నట్లు వివరించారు. అమరావతిలో బిట్స్ పిలానీ సంస్థకు 70 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు. డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా కృషిచేస్తున్నామన్నారు. విశాఖపట్నంలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టినట్లు శాసనసభలో వివరించారు. ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించినట్లు నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో చేనేతల కష్టాలను కళ్లారా చూశానన్న నారా లోకేష్.. చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa