ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాకీ పట్టుకుని నేరుగా వైష్ణోదేవి ఆలయంళ్లోకి వెళ్లిన మహిళ

national |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 07:45 PM

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం ఘటన వెలుగులోకి వచ్చింది. అనేక మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. వారు సరిగ్గా సోదాలు చేయకపోవడంతో ఓ మహిళ నేరుగా తుపాకీ తీసుకుని గుడిలోకి వచ్చేసింది. అయితే పూర్తి లోపలికి వచ్చిన తర్వాత ఆమె వద్ద తుపాకీని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


జమ్ము కశ్మీర్‌లోని శ్రీమాతా వైష్ణో దేవి ఆలయానికి 14, 15వ తేదీ మధ్యరాత్రి ఓ మహిళ దర్శనం కోసం వచ్చింది. అయితే ఆమె వద్ద తుపాకీ ఉండగా.. ఆ విషయం ఎవరికీ చెప్పకుండానే లోపలికి వెళ్లింది. ఆలయం ప్రదాన గేటు వద్ద నుంచి అనేక మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. ఎవరూ సరిగ్గా సోదాలు చేయలేదు. ఫలితంగా ఆమె ఈ తుపాకీని తీసుకునే గుడిలోకి వెళ్లింది. అయితే పూర్తి లోపలికి వెళ్లిన తర్వాత మహిళ వద్ద తుపాకీ గుర్తించిన ఆలయ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.


ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేస్తున్నట్లు వార్తలు..!


ఆపై కత్రా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు. వెంటనే సదరు మహిళను అరెస్ట్ చేసి ఆమెపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆలయ అధికారుల వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను ఢీల్లీకి చెందిన జ్యోతి గుప్తాగా గుర్తించారు. అయితే ఆమె వద్ద దొరికిన తుపాకీ.. లైసెన్స్డ్ పిస్టోల్ కాగా గడువు ముగిసిపోయిందని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా ఈ మహిళ ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.


ఇకనైనా భద్రతా చర్యలపై దృష్టి పెట్టమంటూ..


కానీ ఆమె ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేయడం లేదని.. ఎస్ఎస్పీ పర్మీందర్ సింగ్ వెల్లడించారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఆలయంలోకి ఓ మహిళ తుపాకీ తీసుకు వచ్చిందని తెలియగా అంతా షాక్ అవుతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అలాంటి ప్రాంతంలో భద్రత లోపించిదంని తెలుసుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆలయ అధికారులు, సిబ్బంది.. భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa