ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:54 AM

మైనర్ బాలికపై ఏడుగురు యువకులు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం. ఏడుగురు నిందితుల్లో ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన ఓ మైనర్ బాలుడు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెంలోని బందువుల ఇంటికి వచ్చిన మైనర్ బాలిక (14). ఈనెల 13న ఒక వివాదం తలెత్తడంతో మనస్తాపానికి గురై ఆ ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చిన బాలిక. ఇది గమనించిన ఇద్దరు యువకులు జి.కొండూరులో దింపుతామని బైక్ పై తీసుకెళ్లి బాలికపై అత్యాచారం. ఆ తర్వాత వారి ఐదుగురు స్నేహితులను పిలిచి దాదాపు 4 రోజుల పాటు బాలికపై ఏడుగురు యువకుల సామూహిక అత్యాచారం. చివరకు బాలికను సోమవారం ఆటోలో తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలి వెళ్ళిన యువకులు. నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న బాలికను గమనించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన మరో ఆటో డ్రైవర్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించి, ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏడుగురు నిందితుల్లో ఒకరు ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన మైనర్ బాలుడిగా గుర్తించిన పోలీసులు


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com