త్వరలో అమెరికా నుంచి 295 మందికి పైగా అక్రమ వలసదారులు వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 295 మందికి పైగా భారతీయులు స్వదేశానికి తిరిగి రానున్నారని పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది.
ఫిబ్రవరి 5న భారత్కు పంపించిన వలసదారుల పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదని విమర్శించింది. ఈ విషయంపై తమ ఆందోళనను అమెరికాకు తెలియజేశామని భారత విదేశాంగశాఖ తెలిపింది.
![]() |
![]() |