ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ దూరమయ్యాడు. అతడు అనారోగ్యానికి గురయ్యాడని.. దీంతో రాజస్థాన్తో రాయల్స్ మ్యాచ్ ఆడటం లేదని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే చెప్పాడు. ఈ మేరకు టాస్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో కేకేఆర్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. కోల్కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సునీల్ నరైన్.. బ్యాటింగ్లో 26 బంతుల్లో 44 రన్స్ చేసి.. జట్టుకు శుభారంభాన్ని అందించాడు. బౌలింగ్లోనూ నాలుగు ఓవర్లు వేసి.. 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇలాంటి ప్లేయర్ జట్టుకు దూరమవడం కేకేఆర్కు ఇబ్బంది కరంగా మారింది.
ఇక రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఫజల్ హక్ ఫరూఖీ ప్లేసులో శ్రీలంక స్పిన్నర్ హసరంగను జట్టులోకి తీసుకుంది. కాగా ఈ లీగ్లో ఆడిన తమ తమ మ్యాచ్లలో రెండు జట్లూ కూడా ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల ఖాతాను తెరవాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.
తుది జట్లు..
కోల్కతా నైట్ రైడర్స్:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ
![]() |
![]() |