ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నలుగురు పిల్లల గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Crime |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 09:45 PM

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అయితే రోజులాగే అందరూ కలిసి భోజనం చేసి ఆపై పడుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అర్ధరాత్రి కన్నతండ్రే వారి పాలిట కాలయముడయ్యాడు. ముఖ్యంగా ఓ పదునైన కత్తితో నలుగురు పిల్లల గొంతులు కోసి ఆపై అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.


ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ ప్రాంతం మన్పుూర్ చచారి గ్రామానికి చెందిన 36 ఏళ్ల రాజీవ్ కుమార్‌కు మొత్తం నలుగురు పిల్లలు. అందులో పెద్ద కూతురు స్మృతికి 13 ఏళ్లు ఉండగా, రెండో పాప కీర్తికి 9 సంవత్సరాలు. ఇక మూడో బిడ్డ ప్రగతికి 7 ఏళ్ల వయసు కాగా 5 ఏళ్ల కుమారుడు రిషభ్ కూడా ఉన్నాడు. అయితే ప్రతిరోజూ లాగే బుధవారం రాత్రి కడుపు నిండా అన్నం తినేసి హాయిగా పడుకున్నారు. అప్పుడే పిల్లల తండ్రి రాజీవ్ కుమార్ వారి వద్దకు వచ్చాడు. ఓ పదునైన కత్తి చేత పట్టుకుని నలుగురి పిల్లల గొంత కోసి అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.


గురువారం ఉదయం రాజీవ్ తండ్రి పృథ్వీ రాజ్ ఇంటి తలుపులు కొట్టగా తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి అతడు ఇంటిపైకి ఎక్కి మెట్ల మార్గం ద్వారా ఇంట్లోకి వెళ్లాడు. అక్కడే ముగ్గురు మనవరాళ్లు, మనవడు, అలాగే కుమారుడి మృత దేహాలు కనిపించగా.. భయభ్రాంతులకు గురయ్యాడు. అక్కడిక్కకడే కుప్పకూలిపోయాడు. విపరీతంగా రోదిస్తూనే కేకలు వేశాడు. విషయం గుర్తించిన స్థానికులు ఇంట్లోకి పరుగులు పెట్టగా.. అంతా ఐదుగురి మృతదేహాలు చూసి విస్తుపోయారు.


ఓవైపు రాజీవ్ తండ్రి పృథ్వీ రాజ్‌ను ఊరుకోబెడుతూనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రాజీవ్ సహా నలుుగురు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆపై రాజీవ్ ఎందుకు ఈ హత్యలు చేసి ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పృథ్వీరాజ్ సహా స్థానికులు అందరినీ ఆరా తీశారు. ముఖ్యంగా రాజీవ్ భార్య ఆలస్యంగా అక్కడకు చేరుకోగా.. మీరెక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. దారుణం జరిగిన సమయంలో తాను తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లానంటూ.. విపరీతంగా ఏడుస్తూనే ఆమె సమాధానం చెప్పింది. ఈక్రమంలోనే పోలీసులు అందిరినీ ఆరా తీస్తూ, హత్యలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com