ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 09:30 PM

ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో భేటీ కానున్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్‌లు లెక్కించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే... ఆ పిటిషన్ పై 15వతేదీన విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు. గత నెలలో ఈసీని కలిసిన విపక్షాలు తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 2019 ఎన్నికలకు సమయం అంతగా లేదు కాబట్టి కనీసం 50 శాతం వీవీ-ప్యాట్-స్లిప్‌ లను పోలైన ఓట్లతో సరి చూడాలని కోరారు. టిడిపి అధినేత‌, ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇవియం ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసారు. ఇవియంల స్థానం లో బ్యాలెట్ కు వెళ్లాల‌ని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈవీఎం చిప్ ఆధారిత మిషన్ అని, దాన్ని సులభంగా ఏమార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని పై అన్ని పార్టీల‌తో క‌లిసి పోరాడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు అనుగుణంగానే కోర్ట్ లో కేసు వేసారు. ఈ కేసు విషయమై  చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవీఎంలను తయారుచేసినవారు ఆ చిప్‌కు కమాండ్‌ ఇచ్చి మోసం చేసే ఆస్కారం ఉందన్నారు. రెండు మూడు నెలల్లోనే ఈవీఎంలో రికార్డు అంతా పోతుందని, మళ్లీ లెక్కించడానికి సైతం ఆస్కారం ఉండదన్నారు. అమెరికాలో కూడా బ్యాలెట్‌తోనే ఎన్నికలకు వెళుతున్నారని, ప్రపంచమంతా ఈవీఎంలకు వ్యతిరేకంగానే ఉందని చంద్రబాబు చెప్పారు. సింగపూర్‌ ప్రధాని కూడా తాము యంత్రాలపై ఆధారపడబోమని చెప్పారన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa