తమిళనాడులోని మధురైకి చెందిన ఓ ఆటో డ్రైవర్.. తన నిజాయితీని చాటుకుని పోలీసు కమిషనర్ నుంచి రివార్డు అందుకున్నాడు. తమిళనాడులోని కొచ్చడైకి చెందిన 52 ఏళ్ల నాగేంద్రన్ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం రోజు కూడా ఆటో తీసుకుని బయటకు వచ్చిన అతడికి ఓ గిరాకీ వచ్చింది. ముఖ్యంగా తవిట్టు సంతైకి చెందిన 56 ఏళ్ల శరవణ కుమార్ తన కుటుంబాన్ని తీసుకుని తెప్పకుళం వెళ్లాలనుకున్నాడు. ఈక్రమంలోనే నాగేంద్రన్ ఆటో మాట్లాడుకుని అందులోనే ప్రయాణం చేశారు. అయితే తెప్పకుళం వెళ్లగానే.. కుటుంబ అంతా ఆటో నుంచి దిగిపోయింది. కానీ అందులోనే ఓ బ్యాగును మర్చిపోయారు. ఆ విషయం తెలియని ప్రయాణికులు వెళ్లిపోగా.. నాగేంద్రన్ కూడా దాన్ని గమనించలేదు.
కానీ చాలా దూరం వెళ్లిన తర్వాత ప్రయాణికుడు శరవణ కుమార్ తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయినట్లు గుర్తించాడు. అందులో 12 తులాల బంగారు ఆభరణాలు, తన మొబైల్ ఫోన్ ఉండడం గుర్తొచ్చి.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆటో డ్రైవర్ నాగేంద్రన్.. కొద్ది సమయం తర్వాత ఆటోలో బ్యాగు ఉండడం గుర్తించాడు. వెంటనే దాన్ని తీసుకుని తెరిచి చూడగా.. అందులో బంగారు ఆభరణాలు కనిపించాయి. అయితే అప్పటి వరకు తాను శరవణ్ కుమార్ కుటుంబాన్ని మాత్రమే ఆటోలో ఎక్కించుకోగా అది వారిదే అని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే డబ్బులు, నగలపై ఆశతో దాన్ని కొట్టేయాలనుకోకుండా.. నిజాయితీగా వెళ్లి ప్రయాణికుడిని తిరిగిచ్చేయాలనుకున్నాడు.
ఇక ఆలస్యం చేయకూడదని భావించి నేరుగా వారిని ఎక్కించుకున్న తవిట్టు సంతైకి వెళ్లాడు. కానీ వారు అక్కడ కనిపించకపోయేసరికి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన ఆటోలో ఎక్కిన వాళ్లు దాన్ని బంగారం, మొబైల్ ఫోన్ ఉన్న బ్యాగు మర్చిపోయారని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ఫోన్ నుంచి.. రెగ్యులర్ కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేశారు. బ్యాగు తమ వద్దే ఉందని చెప్పగా.. తెప్పకుళం పోలీస్ స్టేషన్కు వచ్చి అప్పగించాలని కోరారు. దీంతో నాగేంద్రన్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ బ్యాగును.. శరవణ కుమార్కు అప్పగించాడు. నిజాయితీగా బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును అప్పగించడం చూసిన పోలీస్ కమిషనర్ జె. లోగనాథన్.. ఆటో డ్రైవర్ నాగేంద్రన్ను సత్కరించాడు. అలాగే రూ.1000 రివార్డు ఇచ్చాడు. ఈ విషయం కాస్తా నెట్టింట వైరల్ కాగా.. ఆటో డ్రైవర్ మంచితనం చూసి అంతా ఫిదా అయిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa