రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడి పరిస్థితులు పూర్వపు బీహార్ను తలపిస్తున్నాయని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి దౌర్జన్యానికి అంతు లేకుండా పోయిందని, ఎక్కడా ఏ మాత్రం బలం లేకున్నా గెల్చేందుకు ప్రయత్నించారని, ఆ దిశలోనే అన్ని చోట్లా యథేచ్ఛగా దాడుల పర్వం కొనసాగించిందని ధ్వజమెత్తారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్నివైయస్ జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ..... నిన్న రాప్తాడులో జరిగిన ఘటనకు సంబంధించి ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది? ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంది అన్నది ప్రతి ఒక్కరూ వాళ్ల గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే లింగమయ్య భార్య ఉంది. తన భర్తను కోల్పోయిన బాధలో ఉంది. గత నెలలో రాష్ట్రంలో 57 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, 7చోట్ల చంద్రబాబుకు సానుకూల పరిస్థితి లేదు. మిగిలిన వాటిలో ఏకంగా 39 చోట్ల వైయస్సార్సీపీ గెలిచింది. వాటిలో చంద్రబాబుకు బలం లేదు. గెల్చిన వారంతా వైయస్సార్సీపీ సభ్యులే. ఫ్యాన్ గుర్తు గెల్చిన చోట చంద్రబాబుకు బలం లేదని తెలిసీ కూడా హింసను ప్రోత్సహిస్తూ, పోలీసులను తన వద్ద ఉన్న వాచ్మెన్ల కంటే హీనంగా వాడుకుంటున్నాడు. ఒక చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుంది? ఉప సర్పంచ్ పదవి లేకపోతే ఏమవుతుంది చంద్రబాబు?. తాను అధికారంలో ఉన్నాడు కాబట్టి, సంఖ్యాబలం లేకపోయినా ముఖ్యమంత్రిని అన్న అహంకారంతో లా అండ్ ఆర్డర్ను పూర్తిగా ధ్వంసం చేసాడని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa