డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖలో జేఈఈ పరీక్ష మిస్ అయిన 23 మంది విద్యార్థుల బాధ్యత పవన్కళ్యాణ్దే అని వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తేల్చి చెప్పారు. ఈ ఘటనపై విద్యా మంత్రి నారా లోకేష్ స్పందించాలని, పరీక్ష మిస్ అయిన విద్యార్థులకు కేంద్రంతో మాట్లాడి న్యాయం చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.... అడవి తల్లి బాట కార్యక్రమం కోసం అరకు వెళ్లేందుకు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ విశాఖ వచ్చిన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసేందుకు వెళ్లే 23 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో నిర్వాహకులు వారిని పరీక్షలకు అనుమతించలేదు. తాము చేయని తప్పుకు ఆ విద్యార్థుల జీవితం నాశనమైంది. ఏడాదిపాటు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి చదివినా ఫలితం లేకుండా పోయింది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa