ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డొమినికన్ రిపబ్లిక్‌లో నైట్‌క్లబ్ పైకప్పు కూలి 98 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 09:27 PM

డొమినికన్ రిపబ్లిక్‌లో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. అక్కడి ఓ నైట్‌క్లబ్‌లో అర్ధరాత్రి కన్సర్ట్ జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. దీంతో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 98 మంది ప్రాణాలు కోల్పోగా.. 160 మందికి పైగా గాయపడ్డారు. విషయం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలతో పాటు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా గాలిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


డొమినికన్ రిపబ్లిక్‌ రాజధాని నగరం శాంటో డొమింగోలో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడి వన్ స్టోర్ జెట్ సెట్ నైట్‌క్లబ్‌లో మంగళ వారం రోజు రాత్రి ఓ కన్సర్ట్ నిర్వహించారు. ఈక్రమంలోనే వందలాది మంది అక్కడకు వచ్చారు. అంతా కలిసి పాటలు వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తుండగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి పడింది. దీంతో అక్కడున్న అనేక మంది శిథాలల కింద చిక్కుకుపోయారు. మరికొంత మంది ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరగులు పెట్టారు. విషయం గుర్తించిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు.


  ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీసుకువచ్చి అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. అలాగే గాయాపాలైన వారిని కూడా దవాఖానాల్లో చేర్చారు. ప్రమాదం జరిగి 12 గంటలు కావొస్తుండగా.. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో 98 మంది మృతి చెందగా.. 160 మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగే అవకాశం ఉందని.. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే బాధుతుల్లో రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా మోంటోక్రిస్టీ ప్రావిన్సు గవర్నర్ నెల్సీ క్రజ్, బేస్ బాస్ స్టాల్ నీల్సన్ క్రజ్ సోదరి.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే చట్టసభ ప్రతినిధి బ్రే వర్గాస్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అలాగే కన్సర్ట్ నిర్వహిస్తున్న సింగ్ రూబా పిరేజ్ ఆచూకీ ఇంకా దొరకలేదు. శిథిలాల కిందే ఆయన చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం సంగీత కచేరీ ప్రారంభం అయిన గంటసేపటికే జరిగిందని.. భూకంపం వల్ల జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.


మరోవైపు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇప్పటికీ జాడ లేని వారి కోసం.. వారి కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు. ఎలాగైనా సరే తమ వారు ప్రాణాలతో బయటపడాలని, దెబ్బలు తగిలినా ఫర్వాలేదు కాని ప్రాణాలు కోల్పోకుండా కనిపించాలని కోరుకుంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa