ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా ప్రజల ముందు మాత్రం చాలా మంచివారిగా నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో, ప్రచారం చేస్తున్నప్పుడు మరింత హుందాగా నడుచుకుంటారు. ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇస్తూ.. అధికారంలోకి వస్తే అలా చేస్తాం, ఇలా చేస్తామంటూ వివరిస్తారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ రాజకీయ నాయకుడు మాత్రం ఒంటరిగా ఉండే తల్లులకు ఓ చెత్త ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికీ వారికి రుతుస్రావం అవుతుంటే వారితో తాను ఒకరోజు పడుకోవడానికి సిద్ధం అని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రచ్చ లేపుతున్న ఈ కామెంట్లు చేసింది ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిలిప్పీన్కు చెందిన రాజకీయ నాయకుడు క్రిస్రియన్ సియా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన పాసిగ్ సిటీలో ఓ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ ప్రజలను ఉద్దేశించి.. చేయబోయే అభివృద్ధి పనుల గురించి మాట్లాడడానికి బదులుగా ఆయన ఒంటరి తల్లులపై నీచమైన కామెంట్లు చేశారు. ముఖ్యంగా అక్కడి ప్రజలను ఉత్తేజపరచడానికి ఓ చెత్త జోక్ వేశారు. ఇప్పటికీ రుతుస్రావం అవుతున్న ఒంటరి తల్లులతో తాను ఒకరోజు రాత్రి పడుకోవడానికి ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడున్న వారంతా అప్పుడు విరగబడి నవ్వారు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా అతడిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఏప్రిల్ 3వ తేదీన క్రిస్టియన్ సియా ఈ కామెంట్లు చేయగా.. ఆ తర్వాత వారం రోజుల పాటు అంతా ఆయన విమర్శలు గుప్పించారు. మహిళల గురించి, అందులోనూ ఒంటరి తల్లుల గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడగల్గుతారంటూ కామెంట్లు చేశారు. వెంటనే అతడి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే ఫిలిప్పీన్స్ ఎన్నికల కమిషన్ (కోమెలెక్) సియాకు రెండు వేర్వేరు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, ఎందుకు ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయకూడదో చెప్పాలని అందులో కోరింది.
తీవ్ర వ్యతిరేకత రావడంతో తాను చేసిన వ్యాఖ్యలపై క్రిస్టియన్ సియా స్పందించారు. తాను జోక్ చేయాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడినట్లు వివరించారు. తనుకు ఒంటరి స్త్రీలపై అలాంటి ఉద్దేశం లేదని.. ప్రజలను ఉద్దేశ పరచాలనే ఉద్దేశంతో అలా మాట్లాడినట్లు పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించాలని కూడా కోరారు. కానీ ఈయన ఇచ్చిన వివరణలో ఎలాంటి నిజాయితీ లేదంటూ.. ప్రజలు విమర్శలను కొనసాగించారు. ఇందుకు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు తమ పదువులను వదులుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పాసిగ్ నగర కౌన్సిలర్ ఆశావాది షామ్సే సప్సప్-లీ సియా బృందం నుంచి తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. అలాగే మేయర్ అభ్యర్థి సారా డిస్కాయా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa