ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై ప్రకటన వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.ఫలితాలను ఏప్రిల్ 12, 2025 శనివారం ఉదయం 11 గంటల నుంచి చూసుకోవచ్చు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in అనే అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో పొందవచ్చు. అలాగే సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9552300009 అనే నెంబర్కు 'Hi' అని మెసేజ్ పంపితే, మన మిత్ర సేవ ద్వారా తక్షణమే ఫలితాలను పొందవచ్చు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్, 'ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు గడిపిన కష్టసాధ్యమైన రోజు కచ్చితంగా ఫలించాలి. రేపటి ఫలితాలు మీ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం కావాలని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa