36 ఏళ్ల వయసు కల్గిన ఓ మహిళ 24 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్త, 14 ఏళ్ల కుమార్తె కూడా ఉండగా చాటుమాటుగా వ్యవహారం నడిపిస్తోంది. అయితే ఇటవీలే కూతురు ఆ విషయం తెలుసుకుంది. దీంతో తన గురించి బయట పెడుతుందేమోనని భయపడ్డ తల్లి.. ఆలోపే కూతురు పరువు తీయాలనుకుంది. అలా చేస్తే కుటుంబ సభ్యుల దృష్టంతా ఆమెపైనే ఉంటుందని భావించింది. అలా కుమార్తె స్నానం చేస్తుండగా, బట్టలు మార్చుకుంటుండగా వీడియోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసింది. ఆపై స్నేహితులు, బంధువులు, గ్రామస్థులకు పంపించింది. ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరీ కథ చదివేయాల్సిందే.
మహారాష్ట్రలోని పుణేకు చెందిన 36 ఏళ్ల మహిళకు ఇప్పటికే పెళ్లి అయింది. భర్తతో పాటు 14 ఏళ్ల వయసు ఉన్న కుమార్తె కూడా ఉంది. అయితే అత్తామామలు, భర్తతో కలిసి జీవిస్తున్న ఆమె కూలీ పనులు చేస్తుండేది. రోజూ పనికి వెళ్లే చోట తనకంటే వయసులో 12 ఏళ్ల చిన్నవాడైన 24 సంవత్సరాల యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే చాలా రోజులుగా మహిళ ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ.. యువకుడితో ఎంజాయ్ చేస్తోంది. చాటుమాటుగానే వ్యవహారం సాగిస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవలే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన మహిళ.. ఇంటికే తన ప్రియుడిని రప్పించుకుంది. ఇద్దరూ కలిసి గదిలో ఉండగా.. 8వ తరగతి చదువుతున్న కూతురు ఇంటికి చేరింది. తల్లితో పాటు మరో వ్యక్తిని చూడకూడదని స్థితిలో చూసి షాక్ అయింది. మారుమాట్లడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ కుమార్తె ఆ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోనని భయపడ్డ తల్లి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తన ఇంట్లో వాళ్లకు తన గురించి తెలియకుముందే కుమార్తెను వారి ముందు చెడుగా చూపించాలనుకుంది. అందుకోసం కుమార్తె స్నానం చేస్తుండగా, బట్టలు మార్చుకుంటుండగా వీడియో తీసింది.
ఆపై ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన స్నేహితులు, గ్రామస్థులు, బంధువలకు పంపింది. అయితే అనుకోకుండా ఈ వీడియో చూసిన బాలిక మేనత్త వెంటనే ఇంటికి వచ్చి ఆరా తీసింది. అసలేం జరిగిందని బాలికతో పాటు ఆమె తల్లిని ప్రశ్నించింది. బాలిక ఏం జరిగిందో తెలియదని చెప్పగా.. తల్లి మాత్రం నీళ్లు నమలడం ప్రారంభించింది. ఇంకాసేపుంటే తన కథంతా బయట పడుతుందని భావించి తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ముఖ్యంగా ప్రియుడికి పోన్ చేసి అతడితో పరారైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే విచారణ జరిపగా.. బాలిక తల్లే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు.
ఆమె ఫోన్ నుంచే ఇదంతా చేసిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బాలిక కూడా షాకైంది. ఇక అప్పటి నుంచి ఆమె గురించి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆమె తల్లి ఇంకా తప్పించుకుని తిరుగుతూనే ఉంది. ఇప్పటికే పోలీసులు సోలాపూర్, ధరశివ్, ఛత్రపతి సంభాజీనగర్, అహల్యనగర్ జిల్లాలతో పాటు దౌండ్ లోనూ గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. కానీ రెండ్రోజుల క్రితమే ఆమె ఖడక్వాస్లా వద్ద ఉన్నట్లు సమాచారం రాగా.. పోలీసులు అక్కడకు చేరుకుని మహిళ సహా ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు పంపించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa