అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి PM మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రధాని రాజధాని నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. మూడు ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తి చేసి తీరాల్సిందేనని CM చంద్రబాబు ఇటీవల అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగసభ వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక నుంచే పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మోదీ నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.ఈ కార్యక్రమానికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.