కొత్త టోల్ విధానం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తుండగా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా మే 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ టోల్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలు కాబోతుందని అంతా చెబుతుండగా.. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం రోజు స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఫాస్టాగ్ టోల్ విధానమే కొనసాగబోతున్నట్లు అర్థం అవుతుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
గత రెండు మూడు రోజులుగా.. కొత్త టోల్ విధానంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఫాస్టాగ్ టోల్ విధానం స్థానంలో... శాటిలైట్ టోల్ విధానాన్ని తీసుకు రాబోతున్నారని మే 1వ తేదీ నుంచే అమలు చేయబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద ఫిక్స్ చేస్తారని వివరించారు. ఇందులో ఏఎన్ పీఆర్తో పాటు ఫాస్టాగ్ను కలిసి సేవలు అందిస్తారని వార్తల్లో రాసుకొచ్చారు.
ఇలా ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే.. వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ని వసూలు చేయవచ్చని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘంచినా ఈ-నోటీసులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. దీని ద్వారానే సదరు వాహన దారులకు ఫాస్టాగ్ రద్దు, పెనాల్టీలు విధించబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఉండేందుకే ఈ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రిత్వ శాఖ గతంలోనే పేర్కొంది. కానీ దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకు వస్తుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
అయితే తాజాగా మే 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రాగా.. ప్రజలు, వాహనదారులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈక్రమంలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ విధానాన్ని తీసుకొచ్చేది నిజమే అయినా... ఎప్పుడు అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేమని వివరించింది. దీనిపై నిర్ణయం తీసుకుంటే.. తామే అధికారికంగా ప్రకటిస్తామని అప్పటి వరకు ఫాస్టాగ్ టోల్ విధానమే కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa