ఉత్తర ప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా విశేశ్వర్ గంజ్ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఏప్రిల్ 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే అతడికి విషయం తెలియడంతో.. గ్రామం నుంచి పారిపోయాడు. రెండు రోజుల పాటు అటు పోలీసులు, ఇటు గ్రామస్థులు అతడి కోసం విపరీతంగా వెతికారు. అయినా లాభం లేకపోయింది. కానీ ఏప్రిల్ 3వ తేదీ రోజు సదరు యువకుడు గ్రామస్థులకు పట్టుబడ్డాడు. అయితే వారు అతడిని పోలీసులకు అప్పగించకుండా నేరుగా గ్రామానికి తీసుకెళ్లారు.
ఇష్టం వచ్చినట్లుగా.. తిడుతూ కొడుతూ దాడికి పాల్పడ్డారు. ఆపై ఓ ఎడ్ల బండిని తీసుకువచ్చి దానికి అతడిని కట్టేశారు. ఆ తర్వాత అతడిని పూర్తి నగ్నంగా మార్చి ఊరంతా తిప్పుతూ కొట్టారు. ఈక్రమంలోనే పలువరు అతడిపైకి కుక్కలను కూడా ఉసిగొల్పేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు.. గ్రామస్థుల కాళ్లావేళ్లా పడుతూ అతడిని వదిలేయమని ప్రాధేయపడ్డారు. కానీ ఏమాత్రం కనికరం చూపకుండా వారు దాడి చేస్తూనే ఉన్నారు. ఇలా ఊరంతా తిప్పగా.. యువకుడు స్పృహ కోల్పోయాడు. దీంతో అతడిని ఓ చోట పడేసి గ్రామస్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.
అయితే అక్కడే ఉన్న అతడి కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు అతడు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందగా.. పలువురు గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఈ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. ముఖ్యంగా అత్యాచార నిందితుడు సహా అతడి కుటుంబ సభ్యులు ఏప్రిల్ 17వ తేదీన ఈ వీడియోను చూశారు. ఆపై నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్యాచార నిందితుడిని కొట్టి నగ్నంగా ఊరేగించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఈ గొడవ మరింత ముదిరింది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. అక్కడే కాపు కాస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa