చాలా మందికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులో చేపలు, రొయ్యల్ని ఎక్కువగా తింటారు. ఇక, రొయ్యలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. రొయ్యల ఇగురు, గోంగూర రొయ్యల కూర, రొయ్యల ఫ్రైను చాలా మంది ఇష్టంగా తింటారు. రొయ్యల్లో ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. రొయ్యల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. రొయ్యలు తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. రొయ్యల్లోని ప్రోటీన్ కండరాల్ని దృఢంగా మారుస్తుంది. రొయ్యల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొవ్వును కరిగిస్తాయి. రొయ్యల్లో విటమిన్ బి12 కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బలహీనత, అలసటను తగ్గించడంలో సాయపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే రొయ్యల్లో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే, రొయ్యలు తిన్న వెంటనే లేదా రొయ్యలతో కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి. ఇవి తింటే ఆరోగ్యానికి ప్రమాదం. ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పాలు
ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలను తరచుగా క్రీమీ సాస్లతో కలిపి లేదా క్రీమ్ లేదా పాలలో వండుతారు. కానీ ఈ కలయిక అలెర్జీ ప్రతిచర్యలకు దారితీస్తుంది. ఎందుకంటే పాల ఉత్పత్తులలోని కాల్షియం రొయ్యలలోని ప్రోటీన్లతో చర్య జరిపి కడుపులో జీర్ణక్రియకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ ఎక్కువకాలం తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు
పెరుగు కూడా రొయ్యలు తిన్న వెంటనే కలిపి తీసుకోకూడదు. చాలా మంది చేపతో భోజనం చేసిన తర్వాత.. పెరుగుతో తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఇక, రొయ్యల బిర్యానీలో కూడా పెరుగు కలుపుకుని తింటాం. ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అజీర్తి సమస్యలు ఉన్నవారు ఈ కాంబినేషన్కు దూరంగా ఉండాలి.
వేయించిన, స్పైసీ ఫుడ్స్
వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్తో కలిపి రొయ్యలు తినకూడదు. రొయ్యలు తిన్నప్పుడు తేలికపాటి రుచి కొంత వరకు తగ్గుతుంది. రొయ్యలతో పాటు వేయించిన ఆహారాలు, మసాలా ఫుడ్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పి వస్తాయి. అందుకే రొయ్యలతో పాటు ఈ ఫుడ్స్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు
రొయ్యలలో సహజంగా లభించే ఐరన్ ఒక మోస్తరు మొత్తంలో ఉంటుంది. ఎర్ర మాంసం లేదా పాలకూర వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలతో వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మెరుగుపడుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే ఐరన్ ఎక్కువగా అవసరం లేని ఇది హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అధిక పిండి పదార్థాలు కలిగిన ఫుడ్స్
బ్రెడ్, పాస్తా లేదా వైట్ రైస్ వంటి స్టార్చ్ అధికంగా ఉండే ఆహారాలు రొయ్యలతో కలిపి తినడం అంత మంచిది కాదు. రొయ్యలతో పాటు ఎక్కువ స్టార్చ్ తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపులో చికాకు వంటి సమస్యలు కలుగుతాయి. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్ను అవాయిడ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
సిట్రస్ ఫ్రూట్స్
రొయ్యలతో పాటు సిట్రస్ ఫ్రూట్స్, జ్యూసులు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిట్రస్ ఫ్రూట్స్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. రొయ్యల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ కలిపి చర్య జరిపే అవకాశం ఉంది. దీంతో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్కి దూరంగా ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa