ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ 2025 పలువురు ఖరీదైన ఆటగాళ్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని వైనం

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 08:05 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్అంటే కేవలం మైదానంలో సిక్సర్లు, ఫోర్ల హోరు మాత్రమే కాదు.. ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీలు కుమ్మరించే కోట్ల రూపాయలు కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే. తమ జట్టుకు ట్రోఫీ అందించగలరనే నమ్మకంతో ఫ్రాంచైజీలు కొందరు ఆటగాళ్లపై భారీ మొత్తాలను వెచ్చిస్తాయి. కొందరు ఆటగాళ్లు తమ ధరలకు తగ్గట్టు రాణిస్తే, మరికొందరు విఫలమవుతారు. అయితే, వీటికి భిన్నంగా మూడో కోవలోకి వచ్చే ఆటగాళ్లు కొందరున్నారు. వీరికి వేలంలో కోట్లు పలికినా, మైదానంలో తమ సత్తా చాటే అవకాశం మాత్రం ఇంకా రాలేదు. ఫిట్‌నెస్ సమస్యలు, జట్టు కూర్పులో సర్దుబాట్లు వంటి కారణాలతో ఐపీఎల్ 2025 సీజన్‌లో పలువురు ఖరీదైన ఆటగాళ్లు ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమయ్యారు.రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడై, ప్రస్తుత సీజన్‌లో ఇంకా అరంగేట్రం చేయని కొందరు కీలక ఆటగాళ్ల వివరాలు ఇలా 


మయాంక్ యాదవ్ – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 11 కోట్లు)


టి. నటరాజన్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 10.75 కోట్లు)


జాకబ్ బెథెల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 2.6 కోట్లు)


గెరాల్డ్ కోయెట్జీ – గుజరాత్ టైటాన్స్ (రూ. 2.4 కోట్లు)


రహ్మానుల్లా గుర్బాజ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 2 కోట్లు)


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa