ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలు.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

international |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 10:36 PM

భారత్-పాక్ మధ్య యుద్ధం తప్పదా. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేయడం వెనుక కారణం ఏంటి. ఒకవేళ భారత్ దాడి చేస్తే.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం వెనుక మతలబు ఏంటి. భారత్ దాడి చేస్తే.. తిరిగి దాడి చేసేందుకు పాక్ సిద్ధంగా ఉందా. లేక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందా. అసలు భారత్‌తో యుద్ధం అంటే పాక్ 


పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆ దాడితో పాక్‌పై అనేక ఆంక్షలు విధించిన భారత్.. ఆ దేశాన్ని దూరం పెట్టింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్‌ హస్తం ఉందని పేర్కొంటున్న భారత్.. ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించగా.. ఇప్పుడు వాటికి దాయాది దేశం కూడా ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ తీసుకున్న దౌత్య నిర్ణయాల నేపథ్యంలో తాజాగా పాక్ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ఆ దేశ సెక్యూరిటీ కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురు పాక్ మంత్రులు, పాక్ త్రివిధ దళాలకు చెందిన చీఫ్‌లు పాల్గొని.. దాదాపు భారత్‌ తీసుకున్న నిర్ణయాలనే కాపీ కొట్టింది.


పాకిస్తాన్‌లో సార్క్‌ వీసా మినహాయింపు స్కీమ్ ద్వారా పర్యటిస్తున్న భారతీయులకు అనుమతులతో పాటు, ఇతర వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు పాక్‌ ప్రకటించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. ఇక అట్టారీ బోర్డర్‌ను మూసివేయాలని భారత్‌ నిర్ణయించగా.. దానికి ప్రతిగా వాఘా బోర్డర్‌ను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. ఇక 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రక‌టించింది.


  అంతేకాకుండా పాకిస్తాన్ గగనతలంలోకి భారత్‌కు చెందిన విమానాలు గానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గానీ ప్రయాణించకుండా ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో భారత్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని పాకిస్తాన్ ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.


ఇక సింధూ నదీ జలాల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్‌ ఖండించింది. ఇది 24 కోట్ల పాకిస్తాన్‌ ప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొంది. సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు కేటాయించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి చేసే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. అలాంటి చర్యలను తిప్పికొడతామంటూ వెల్లడించింది. ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు సింధూ నదీ జలాలను తరలించకుండా అడ్డుకుంటే.. ఆ దేశం మరింత ఎడారిలా మారే ప్రమాదం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa