ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ నూతన రాజ్యసభ అభ్యర్థిగా పాకా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 29, 2025, 01:34 PM

బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విజయవాడలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పాకా మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తాను బీజేపీలో పని చేస్తున్నానని, బీజేపీ పట్టణ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర నేతగా ఎదిగానని, డ్రాప్టింగ్ కమిటీ ఛైర్మన్‌గా, కేంద్ర మంత్రుల బృందానికి కన్వీనర్‌గా, క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్‌గా పని చేశానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa