అమరావతి పున:ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దూర బారాల నుంచి సభకు వస్తున్న వారికి కలెక్టర్ లక్ష్మీ శా కావాల్సిన సౌకర్యాలు చూస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి మానిటర్ చేస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ రాకతో నగరంలోని ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి. ఈ ఒక్కరోజు అవసరాన్ని బట్టి విజయవాడ నగరవాసులు బయటికి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అన్ని మండలాల నుంచి ఎన్ని బస్సులు బయలుదేరాయని, వచ్చిన వారికి భోజన సౌకర్యాలు, పార్కింగ్ ఫెసిలిటీలు లక్ష్మీశా కల్పిస్తున్నారు. మండలాల నుంచి బయలుదేరుతున్న బస్సుల వద్దకే టిఫిన్, భోజన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి 450 బస్సులు బయలుదేరాయని.. కేవలం పార్కింగ్ కోసమే 350 ఎకరాలు కేటాయించామని కలెక్టర్ లక్ష్మీ శా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa