2014లో ఏపీ అసెంబ్లీ విజయవాడ-గుంటూరు మధ్య కృష్ణా నది తీరంలో రాజధాని నిర్మాణానికి బిల్లు ఆమోదించింది. 2015లో రాజధానికి అమరావతి పేరు ఖరారై, 53,748 ఎకరాలు నోటిఫై చేశారు. 34,794 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి, తాత్కాలికంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించారు. ఇప్పుడు రాయపూడి సమీపంలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. తాజాగా మరో 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.మరోవైపు పెద్దసంఖ్యలో కార్మికులు రాజధాని నిర్మాణ పనుల్లో ఉన్నారు. వీరికోసం నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేశాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల తర్వాత అమరావతి నిర్మాణ పనుల్లో వేగం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa