ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి: మంత్రి నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 04:46 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని మూడేళ్లలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరై, "అమరావతికి నేనున్నానని" భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. 
"దాదాపు 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా పునాది పడిన అమరావతి, ఇప్పుడు మళ్లీ ఆయన చేతులతోనే పునఃప్రారంభమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పాదాభివందనాలు," అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. 
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అమరావతి అభివృద్ధిని విధ్వంసం చేసిందని, దీని కారణంగా ప్రాజెక్టు కుంటుపడిందని ఆయన విమర్శించారు. "ఇప్పుడు మళ్లీ సరైన దిశగా అమరావతి నిర్మాణం వేగవంతం కానుంది," అని ఆయన ఉద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa