ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంలో యువతి దారుణ హత్య: పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

Crime |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 04:50 PM

విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ దారుణ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఫార్చ్యూన్ లే అవుట్ సమీపంలో జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనను పరిశీలించారు. ఈ హత్య వెనుక గల కారణాలు, దుండగుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన విశాఖ నగరంలో కలకలం రేపింది. యువతి గుర్తింపు, హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa