ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ ప్రధాని యూట్యూబ్ ఛానల్‌ నిలిపివేత!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 06:29 PM

పహల్‌గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ యూట్యూబ్ ఛానల్‌ స్ట్రీమింగ్‌ను మనదేశంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జాతీయ భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదని ఆ ఛానల్‌ క్లిక్‌ చేసిన వారికి ఒక సందేశం దర్శనమిస్తోంది. పాక్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్లు, ప్రసారాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.పాకిస్థాన్ క్రికెటర్స్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ అఫ్రిదీ ఇన్‌స్టా ఖాతాలను తాజాగా సస్పెండ్ అయ్యాయి. పాకిస్థాన్‌ జావెలియన్‌ త్రోయర్, ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఇప్పటికే బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత చట్టపరమైన చర్యల్లో భాగంగా భారత్‌లో అతని ఖాతాను నిలిపివేశారు. ‘‘భారత్‌లో నదీమ్‌ ఖాతా అందుబాటులో లేదు. ఖాతాలోని సమాచారాన్ని నియంత్రించాలన్న చట్టపరమైన అభ్యర్థనను పాటిస్తున్నాం’’ అని భారత్‌లో నదీమ్‌ ఇన్‌స్టా ఖాతా తెరిచిన వాళ్లకు ఈ సందేశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa