ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తాం: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 06:36 PM

అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని, అప్పుడు మోడీని మళ్లీ ఆహ్వానిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ‘మోదీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం. అమరావతి.. 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. 5లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుంది. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా చేస్తాం. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయి’ అని సీఎం అన్నారు.కేంద్ర తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో 90% స్ట్రైక్ రేట్ సాధించాం. కేంద్రం ఇచ్చిన ఆసరాతో ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. కేంద్రం సహకారంతో అమరావతిని పట్టాలెక్కిస్తున్నాం. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు, ఇది వాళ్ల విజయం.. అమరావతి రైతులు చేసిన ఉద్యమం లాంటి ఉద్యమాన్ని ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు." అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa