ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలోని ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు

national |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 11:43 AM

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు శుక్రవారం రాత్రి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆడిటోరియంలో బాంబు పెట్టామని, ఏపీ భవన్‌ను పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తి రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌కు మెయిల్ పంపారు. దాంతో ఆయన అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. అందులో భాగంగా రాత్రి 8:30 కు ‘‘పూలే’’ సినిమా ప్రదర్శించారు. ఈ టైంలో బాంబు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తపై జాగిలాలతో తనిఖీలు చేసి ఏమి లేదని తేల్చారు. అయితే పహల్గాం టెర్రరిస్టు ఎటాక్ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, ఇండియా గేట్ కు కూత వేటు దూరంలో ఉన్న ఏపీ, తెలంగాణ భవన్ కు మెయిల్ రావడం భయభ్రాంతులకు దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa