ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోవాలో తీవ్ర విషాదం.. ఆరుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 11:46 AM

శిర్గావ్‌లోని లయ్‌రయీ ఆలయంలో నిప్పులపై నడిచే ఆచారం. ఈ క్రమంలో రద్దీ ఒక్కసారిగా ఎక్కువై అదుపుతప్పిన పరిస్థితి.ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలింపు.జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసుల అనుమానం.   మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.ఈ క్రమంలో శనివారం ఉదయం నిప్పుల గుండం తొక్కే తంతు మొదలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కసారిగా భక్తు రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగే క్రమంలో  తొక్కిసలాట జరిగిందిశ్రీ లైరాయ్‌ ఆలయంలో వార్షిక జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వహాకులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa