మంగళూరులో రౌడీ షీటర్ హత్య హై అలర్ట్ పరిస్థితులకు దారి తీసింది. మంగళూరుకు చెందిన సుహాస్ శెట్టి అనే రౌడీ షీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమై మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే మే ఒకటవ తేదీన రాత్రి 8:30 నిమిషాలకు సుహాష్ శెట్టి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి వాజ్పేయి లోని కిన్ని కమల అనే ఒక ప్రాంతంలో కార్లో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలోనే ఆరుగురు ప్రత్యర్థులు గల రెండు కార్లు ఆయన్నను వెంబడించాయి. కొద్ది దూరం తర్వాత ఆ కారును అడ్డగించి కార్లోంచి సుహా శెట్టిని బయటకు లాగి విచక్షణా రహితంగా కత్తులతో రాళ్లతో దాడి చేశారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సిసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సుహా సత్యతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హత్యకు గురైన సుహాష్ శెట్టి హిందూ కార్యకర్త. గతంలో బజరంగ్ దల్ గో సంరక్షణ విభాగంలో సభ్యుడుగా ఉన్నాడు. హిందూ కార్యక్రమాల్లో ఆయన కీలకంగా పాల్గొంటాడు. దీంతో ఆయన మరణం పైన పెద్ద ఎత్తున అనుమానాలు తలెత్తుతున్నాయి. 30 ఏళ్ల సుహాష్ శెట్టి 2022లో ఫాజిల్ హత్య కేసులో ఏవన్ నిందుతుడుగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa