ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 12:38 PM

భారీ వర్షాలు పడతాయని ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉందని, కానీ పొలాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ఖరీఫ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వరి రైతులు రబీ సీజన్‌లోనూ కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం చలనం లేకుండా ఉంది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.’ అని అన్నారు.వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa