ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగలు పట్టుకుని మరీ,,,,,బడిలోనే కొట్టుకున్న టీచరమ్మలు

national |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 09:06 PM

మధ్య ప్రదేశ్‌ ఖర్గోన్ జిల్లాలోని ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలో.. ప్రవీణ్ దహియా ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అలాగే మధు రాణి అనే మహిళ లైబ్రేరియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు. పని విషయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మే 2వ తేదీ శుక్రవారం రోజు కూడా ప్రిన్సిపాల్ ప్రవీణ్ దహియా, లైబ్రేరియన్ మధురాణి మధ్య.. విద్యార్థులు పుస్తకాలు తీసుకునే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం ప్రారంభించారు.


అలాగే ఇరువురు ఎవరి ఫోన్లు వారు తీసుకుని.. ఒకరినొకరు వీడియో తీసుకున్నారు. ఇంతలోనే ఒకరికి విపరీతమైన కోపం రాగా.. ఎదుటి టీచర్ ఫోన్ తీసి నేలకేసి కొట్టారు. దీంతో మరో ఉపాధ్యాయురాలు కూడా అదే పని చేయగా.. ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. దుర్భాషలాడుకుంటూనే సిగలు పట్టుకుని మరీ ఇష్టం వచ్చినట్లుగా దాడి చేసుకున్నారు. ఆపై ప్రిన్సిపల్, లైబ్రేరియన్ ఇద్దరూ.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. ఆపై అవే గాయాలతో ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. ఇదే సమయంలో అక్కడున్న కొందరు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టగా నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఇద్దరు టీచరమ్మలు కొటట్టుకోవడం చూసి అంతా షాక్ అయ్యారు.


ఇలా ఈ వీడియో కాస్తా ఖర్గోన్ జిల్లా కలెక్టర్ భవ్య మిట్టర్ వరకు వెళ్లగా.. ప్రధానోపాధ్యారాలు ప్రవీణ్ దహియా, లైబ్రేరియన్ మధురాణి ఇద్దరినీ పాఠశాల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ఖర్గోన్ గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రశాంత్ ఆర్య వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరినీ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు కూడా వివరించారు. ఇద్దరికీ కోపం, అహంకారం ఎక్కువగా ఉండడం వల్లే ఈ గొడవ జరిగిందని.. ప్రస్తుతం ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa