ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై జైత్రయాత్రకు చెక్‌ పడ్డట్లేనా

sports |  Suryaa Desk  | Published : Tue, May 06, 2025, 11:04 PM

తొలి 5 మ్యాచ్‌లలో ఒకదాంట్లో మాత్రమే గెలిచి.. ఆ తర్వాత ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన ముంబై ఇండియన్స్‌.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తడబడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే చేసింది. తొలుత భారీ స్కోరు చేసేలా కనిపించినా.. ఆ తర్వాత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.


ఐపీఎల్‌ 2025లో ముంబై ఇండియన్స్ డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్‌లో దూసుకొచ్చింది. అయితే ప్లే ఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో ఆ జట్టు తడబడుతోంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫస్టు బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. కానీ తొలి పది ఓవర్లలో 89/2 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత పది ఓవర్లలో 66/6 రన్స్ మాత్రమే చేసింది. దీంతో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ మాత్రమే స్కోరు చేసింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ర్యాన్ రికల్టన్ (2), రోహిత్ శర్మ (7) సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. అయితే ఈ దశలో విల్ జాక్స్ (35 బంతుల్లో 53 రన్స్‌), సూర్యకుమార్ యాదవ్‌ (24 బంతుల్లో 45 రన్స్‌) చేయడంతో పది ఓవర్లు ముగిసే సరికి 89/2తో నిలిచింది. కానీ ఆ తర్వాత సీన్‌ రివర్స్ అయింది.


ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు దెబ్బకు గుజరాత్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్యా (1), నమన్ ధీర్ (7) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. దీంతో చివరి పది ఓవర్లలో ముంబై ఆరు వికెట్లు కోల్పోయి.. కేవలం 66 రన్స్ మాత్రమే చేసింది. కార్బిన్ బాష్ (22 బంతుల్లో 27) మెరుపులు మెరిపించడంతో చివరి ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ స్కోరు చేసింది.


వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్లు సరిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ముంబై ఇంకా తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సింది. పవర్ ప్లే ముగిసేలోపే.. విల్ జాక్స్‌, సూర్యకుమార్ యాదవ్ ఔట్ కావాల్సింది. కానీ స్వల్ప వ్యవధిలోనే గుజరాత్ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేశారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ ఒక్కో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa