ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్‌గామ్ మృతులకు న్యాయం చేసేందుకే: కల్నల్ సోఫియా

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:11 PM

ఆపరేషన్ సిందూర్‌పై ఢిల్లీలో బుధవారం విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ‘పహల్‌గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్. గత 30 ఏళ్లుగా ఉగ్రమూకలకు పాకిస్థాన్ సౌకర్యం కల్పిస్తోంది. పాక్‌లోని 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశాం. పాక్, పీవోకేలో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించాం.’ అని అన్నారు.ఎల్‌వోసీ (LOC) నుంచి 30 కి.మీ దూరంలో కోట్లీ, బర్నాలపై దాడి చేశామన్నారు. అదేవిధంగా సియాల్‌కోట్‌లోని సర్జల్, మెహమూనా జాయా సియాల్‌కోట్‌పై మిసైల్స్ ప్రయోగించామని అన్నారు. ఇక కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలను సమర్థవంతంగా ఛేదించామని తెలిపారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడి చేశామని, పాక్ సైనిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. పాక్ చర్యలను ఎదుర్కొనేందుకు భారత దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa