ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ అన్యాయంగా జమ్మూకశ్మీర్‌ పౌరులపై దాడి : ఒమర్ అబ్దుల్లా

national |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 12:21 PM

పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాక్‌, పీవోకే‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు నిర్వహించింది. పాక్ మిలిటరీ, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ ప్రతిస్పందన స్పష్టంగా ఉంది. పాకిస్థాన్‌లోని పౌరులను కాకుండా కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. అయితే, పాక్‌ మాత్రం అన్యాయంగా జమ్మూకశ్మీర్‌ పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టన పెట్టుకుంది’ అని ఆయన విమర్శించారు. ఇక, ఎల్‌ఓసీ వెంట ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు అబ్దుల్లా తెలిపారు. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, పాక్‌ చర్యలకు దీటుగా ఎదుర్కొంటామన్నారు. ఈసందర్భంగా ప్రస్తుతం పౌరుల భద్రత, వారికి మౌలిక సదుపాయాలు సమకూర్చడం వంటి వాటిపైనే దృష్టిసారించినట్లు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa