టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. తాజాగా మరో అంతర్జాతీయ ఫార్మాట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ను టెస్ట్ కెప్టెన్గా తొలగించారనే వార్తలు వైరల్ అయిన కొన్ని నిమిషాల తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇప్పటి వరకు 67 టెస్టు మ్యాచ్లు ఆడిన రోహిత్.. 4,301 పరుగులు( 40.57 సగటుతో ) చేశాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధశతకాలున్నాయి.ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. భారత్ తరఫున ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగుతాడు.కాగా , వన్డే ప్రపంచకప్ గెలవడం తన కల అని ఎన్నోసార్లు చెప్పిన రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడే అవకాశాలు ఉన్నాయి.జట్టులో రోహిత్ భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా నిర్ణయం సెలెక్టర్లే తీసుకుంటారని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తప్పిస్తామని సెలెక్టర్లు చెప్పడంతో.. ఇక పూర్తి టెస్ట్ ఫార్మాట్కే దూరం అవ్వాలని రోహిత్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa