ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆపరేషన్ సింధూర్’కు దేశం మొత్తం మద్దతిస్తోంది: కిరణ్ రిజిజు

national |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 11:36 AM

‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో భారత బలగాలకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఆల్ పార్టీ మీటింగ్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చోటు చేసుకోవని స్పష్టం చేశారు. దేశ భద్రతే ముఖ్యమని, మిగతా విషయాలన్ని తర్వాతే అని అన్నారు.‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతమైన సైనిక చర్యను ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సైనిక చర్య అమలు క్రమాన్ని ప్రతిపక్షాలకు తెలియజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ అంతర్గత భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు అమిత్ షా తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa