ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ కాల్పుల విరమణ.. తక్షణమే అమల్లోకి వచ్చిన సీజ్‌ఫైర్.

national |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 07:31 PM

పాకిస్థాన్‌తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా సైనిక చర్యలకు మాత్రమే పరిమితమని, దాయాదిపై దౌత్యపరమైన ఆంక్షలు ముఖ్యంగా సిందూ నదీ జలాల ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు ఉద్ఘాటించాయి. అంతేకాదు, పాక్ విమానాలకు భారత్ గగనతలం మీదుగా అనుమతి నిరాకరణ, పాకిస్థాన్ నటులు... ఆ దేశ యూట్యూబ్ ఛానెల్స్, కంటెంట్‌పై నిషేధం, వాణిజ్య సంబంధాల రద్దు కొనసాగుతుందని తేల్చిచెప్పాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire)పై చర్చల ప్రతిపాదన మొదట పాకిస్థాన్ నుంచే వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత రాజీలేని వైఖరిలో ఎప్పటికీ మార్పు ఉండబోదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa