భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య అనవసరం విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. నోరు పారేసుకుని ట్రోల్స్కు గురవుతున్న పాక్ మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిదీ.. మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ నవ్వులపాలయ్యే అతడు మళ్లీ నోరుపారేసుకున్నాడు. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై మాట్లాడుతూ.. భారత్పై విమర్శలు గుప్పించాడు. భారత సైన్యమే ముందుగా తమ దేశంపై దాడి చేసిందని.. కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. ఇప్పుడు మోదీకి అర్థమైందని.. నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ సైన్యానికి మద్దతు తెలుపుతూ కరాచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అఫ్రిదీ పాల్గొన్నాడు. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. “పాకిస్థాన్పై భారత సైన్యమే తొలుత దాడి చేసింది. వారికి సరైన రీతిలో పాకిస్థాన్ సైనికులు బదులిచ్చారు. ఆ దేశ ఆర్మీని సైలెంట్ చేశారు. భారత్.. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయలేదు. ఆ దేశం పాకిస్థాన్లోని పిల్లలపై దాడి చేసింది. పౌర ప్రాంతాలు, మసీదులపై అటాక్ చేసింది. కానీ వాటిని పాక్ సైన్యం అడ్డుకుంది. పాకిస్థాన్ను ఎదుర్కోవడం ఎంత కష్టమో భారత ప్రధాని మోదీకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. మేం శాంతిని ప్రేమించే వాళ్లం. కానీ దురాక్రమణలను చూస్తూ మౌనంగా కూర్చోం. సరైన రీతిలో బదులిస్తాం” అని అఫ్రిదీ ఆ ర్యాలీలో వ్యాఖ్యలు చేశాడు. కాగా షాహిద్ అఫ్రిదీ భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. గతంలోనూ అతడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశాడు. పహల్గాం ఉగ్రదాడిని అడ్డుకోవడంలో భారత సైన్యం విఫలమైందని.. ఇటీవల కామెంట్స్ చేశాడు.
“పాకిస్థాన్ను భయపెట్టాలని భారత్ ప్రయత్నిస్తోంది. కానీ చాలా కాలంగా మేం ఈ యుద్ధంలో ఉన్నాం. పాక్ సైన్యంతో వాళ్లు పోటీ పడలేరు. ఉగ్రవాదాన్ని ఎవరూ సపోర్ట్ చేయరు. ఏ మతం కూడా ఎంకరేజ్ చేయదు. మేం చాలా కాలంగా ఉగ్రవాదంతో పోరాడుతున్నాం. మన మతం శాంతి గురించి మాట్లాడుతుంది. పహల్గాంలో భారత్ తన సొంత ప్రజలను చంపుకుని, పాకిస్థాన్ను నిందిస్తోంది. తన ప్రజలను కూడా భారత సైన్యం కాపాడుకోలేకపోతోంది. పహల్గాం దాడిలో పాక్ దాడిపై రుజువు ఇవ్వండి” అని అఫ్రిదీ బీరాలు పలికాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa