ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లా దారుణం.. కారు లాక్ కావడంతో నలుగురు చిన్నారులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 07:43 PM

విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా మండల ఆఫీసు వద్ద ఆగి ఉన్న ఓ కారులో నలుగురు చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లారు. అయితే వారు కారులోకి వెళ్లి డోర్ వేసిన వెంటనే అది ఆటోమేటిక్‌గా లాక్ అయింది. వాహనంలో గాలి ప్రవాహం లేకపోవడంతో ఊపిరాడక చిన్నారులంతా శ్వాస తీసుకోలేక మృతి చెందారు.
ఈ ఘటనలో మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ - ఉమా దంపతుల కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6), కంది సురేష్ - అరుణ దంపతుల కుమార్తె మనస్విని ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాదకర సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
ఈ సంఘటన మరొకసారి చిన్నారుల భద్రతపై ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పార్క్ చేసిన వాహనాలలో పిల్లలు ఆటలాడకుండా పెద్దలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa