ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాకు శశిథరూర్, రష్యాకు కనిమొళి టీం

national |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 07:44 PM

పహల్గాం ఉగ్రదాడితో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఓవైపు దాయాది దేశంపై దౌత్యపరమైన చర్యలు తీసుకుంటూనే ఆపరేషన్ సిందూర్ పేరిట క్షిపణి దాడులు చేసింది. అయితే ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అందరికీ తెలిసేలా చేసేందుకు విదేశాలకు మన దేశ ఎంపీలను పంపుతోంది. ఆపరేషన్ సిందూర్ నిర్వహణ సహా పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి, పోషిస్తోందని చెప్పేందుకు ఇప్పటికే ఏడుగురు ఎంపీలతో కొన్ని గ్రూపులను సిద్ధం చేసింది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఒకరు కాగా ఆయన అమెరికా వెళ్లబోతున్నారు. అలాగే కనిమొళి రష్యాకు వెళ్లనున్నారు. మొత్తంగా ఎన్ని జట్లు ఉన్నాయి, ఏయే జట్లు ఏయే దేశాలకు వెళ్లబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. ప్రపంచ దేశాలపై ఎలా విషం చిమ్ముతుందో, దాని వల్ల భవిష్యత్తులో రాబోయే సమస్యలు ఏంటో అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్, బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్, బీజేపీ లీడర్ బైజయంత్ పాండా, జేడీయూ నాయకుడు సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నాయకురాలు కనిమొళి, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలె, శివసేనకు చెందిన శ్రీకాంత్ శిందేలను బృందాలకు నేతృత్వం వహించే లీడర్లుగా ఎంపిక చేశారు. అయితే వీరంతా దేశం తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచ దేశాలకు వివరించబోతున్నారు.


అయితే ఈ ఏడు బృందాలు మొత్తంగా 32 దేశాలకు వెళ్లనున్నాయి. నాలుగు గ్రూపులు 5 దేశాలకు వెళ్తుండగా.. మిగతా మూడు బృందాలు మాత్రం 4 దేశాలకే వెళ్లి ఆపరేషన్ సిందూర్, పాక్ ఉగ్రవాద చర్యల గురించి వివరించబోతుంది. ముఖ్యంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా ఏయే బృందాలు ఏయే దేశాలకు వెళ్లబోతున్నాయో ప్రకటించారు.


ఏయే గ్రూపు ఏయే దేశాలకు వెళ్లబోతుందంటే..?


శశిథరూర్ టీం..: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా


సుప్రియా సూలె టీం..: ఈజిప్టు, ఖతార్, ఇథియోపియా, దిక్షిణాఫ్రికా


కనిమొళి టీం..: స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా


బైజయంత్ పాండా టీం..: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా


రవశంకర్ ప్రసాద్ టీం..: యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్


సంజయ్ కుమార్ ఝా టీం..: ఇండోనేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్


శ్రీకాంత్ శిండే టీం..: యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియొర్రా లియోన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa