ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం ఉగ్రదాడికి యూట్యూబర్ జ్యోతికి సంబంధం?

national |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:24 PM

భారత దేశానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పాకిస్థాన్ నిఘా సంస్థలకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకు పహల్గాం ఉగ్రదాడితో కూడా సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈమె ఈ ఏడాది మొదట్లో పహల్గాం పర్యటకు వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకే పాకిస్థాన్ పర్యటనకు కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తంచారు. ఈక్రమంలోనే 26 మంది పర్యటకుల హత్యలతో ఈమెకు సంబంధం ఉందని భావిస్తున్నారు.


భారత భద్రతా సంస్థలు ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర.. తాజా పర్యటనలు, పాక్‌కు సంబంధించిన వ్యక్తులతో ఏర్పడిన సంబంధాలను పరిశీలిస్తున్నాయి. ప్రత్యేకించి ఆమె పహల్గాం ప్రాంతానికి చేసిన యాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం రోజు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ మాట్లాడుతూ.. ఆధునిక యుద్ధం సరిహద్దులో మాత్రమే జరగదని అన్నారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ తమ కథనాలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను నియమించుకుంటున్నారని తాము గుర్తించినట్లు చెప్పారు. ఏజెన్సీల నుంచి తమకు ఈ సమాచారం అందిందన్నారు.


ముఖ్యంగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర గురించి మాట్లాడుతూ.. ఆమెను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ ఒక ఆస్తిగా భావిస్తున్నారని చెప్పారు. చాలా కాలంగా ఆమె వారితో సంప్రదింపులు జరుపుతోందని గుర్తించినట్లు వివరించారు. అంతేకాకుండా ఆమె తరచుగా పాకిస్థాన్‌కు వెళ్లేదని.. ఆమె ఇటీవలే చైనాను కూడా సందర్శించిందని అన్నారు. అలాగే 2025 జనవరి నెలలో జ్యోతి మల్హోత్రా జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంకు పర్యటన నిమిత్తం వెళ్లారని.. పహల్గాం దాడికి ముందు కూడా ఆమె పాకిస్థాన్‌ను సందర్శించిందని వివరించారు. అయితే ఈ రెండు పర్యటనలకు.. పహల్గాం ఉగ్రదాడికి సంబంధం ఏమైనా ఉందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వీటిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.


ఆమెతో ఇతరు వ్యక్తులు కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తమకు ఆధారాలు లభ్యం అయ్యాయని ఎస్పీ శశాంక్ కుమార్ వెల్లడించారు. అలాగే ప్రస్తుతం జ్యోతి మల్హోత్ర బ్యాంక్ వివరాలు, కదలికలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగిస్తున్నామన్నారు. అంతేకాకుండా 2023లో ఈమెకు పాకిస్థాన్ హైకమిషన్‌లో ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో పరిచయం ఏర్పడిందని.. పొరుగు దేశాన్ని సందర్శించడానికి వీసా కోసం అక్కడకు వెళ్లిందని దర్యాప్తులో వెల్లడైంది. ఇతని ద్వారానే మరికొంత మంది అధికారులతో కూడా సంబంధాలు ఏర్పరుచుకుని సమాచారాన్ని చేరవేసిందని కూడా గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com