ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

international |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 12:03 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. సోమవారం రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 08:54 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయని NCS తన ట్వీట్ ద్వారా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి సమాచారం లేదు. అయితే భూ ప్రకంపణలు కారణంగా ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 2023 అక్టోబర్ 7న హెరాత్ సంభవించిన భారీ భూకంపం (Herat earthquake) కారణంగా.. 2,400 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇది రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో నమోదైన అత్యంత ఘోరమైన ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa